వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండల పరిధిలోని కొప్పుల పల్లిలో రూ. 13 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, పల్లెప్రకృతి వనాన్ని, బొమ్మారంలో రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైఖ్య పాలనలో గ్రామాలలో మౌలిక వసతులు లేక, అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కాని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సర్కార్ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో డంపుయార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాల ఏర్పాటు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడం జరుగుతుందన్నారు.
గ్రామ సచివాలయం అయిన పంచాయతీ భవనాలను ఆధునిక పద్దతిలో అన్ని హంగులతో నిర్మించడం జరుగుతుందని, త్వరలోనే అన్ని గ్రామాలలో పక్కా భవ నాల నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. నూతనంగా ఏర్పాటైన మాసాయిపేట మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
హాల్దీవాగులో కాళేశ్వరం జలాలతో హాల్దీ జీవనదిగా మారనుందని, ఉమ్మడి వెల్దుర్తి మండల పరిధిలోని చాలా గ్రామాలకు సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరం అవుతాయని, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు సస్యశ్యామలం కానుందన్నారు.
దళితబంధు పథకం ప్రారంభం చారిత్రాత్మకమని, రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు యావత్ దేశానికి ఆదర్శమని, సీఎం కేసీఆర్ ఆదర్శ ముఖ్యమంత్రి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రాగౌడ్, జిల్లా కోఆప్షన్ మన్సూర్, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు శంకర్, కనకమ్మ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్రెడ్డి, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, ఫకీరా, అశోక్రెడ్డి, బాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి నాయకులు స్టేషన్ శ్రీను, బాల్రెడ్డి, బాచి, సిద్దిరాంలులతో పాటు పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.