మెదక్: జిల్లాలోని తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రెండు వాహణాలను పక్కకి తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.