తూప్రాన్/రామాయంపేట : పండుగలను కలిసికట్టుగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉమ, బొంది వెంకట్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సతీశ్చారి, సత్యలింగం, చక్రవర్తి, సామాల అశోక్, డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.