మెదక్ రూరల్ : రైతులు పంట వివరాలను నమోదు చేసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని వెంకటాపూర్లో ఏఈవో భార్గవితో కలిసి ఆన్లైన్లో నమోదు చేసిన రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో రైతుల వద్దకెళ్లి పంట వివరాలను అడిగి క్రాస్ చెక్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తాము వేసిన పంట, గతంలో సరైన గణాంకాల్లేకుండా పంటల దిగుబడి తెలియక ఇబ్బందిపడే వారని, ప్రస్తుతం ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేయడంతో రైతులకు, అధికారులకు పంటలపై అవగాహన రావడంతోపాటు ఎరువులకు ,ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.