పెద్దశంకరంపేట : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలపరిధిలోని కట్టెల వెంకటాపురం గ్రామానికి చెందిన ఎ. సాయిలుకు సీఎం రిలీప్ఫండ్ కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు.
మండలపరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన సీహెచ్ మానయ్యకు మంజూరైన రూ.11వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, తదితరులున్నారు.