కొల్చారం : జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
మండల కేంద్రమైన కొల్చారంలో జైన మందిరం వార్షికోత్సవాన్నిపురస్కరించుకుని గురువారం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. శాంతి కోసం తపించిన జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి బయల్పడిన కొల్చారం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో జైన ప్రతినిధులు సుమేర్చంద్ పాండియా, రాజేశ్కుమార్ పహడియా, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, సర్పంచ్ ఉమ, మెదక్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.