నిజాంపేట, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత గ్రామాలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. దీంతో ప్రతి గ్రామం శుభ్రంగా మారింది. ప్రతి పంచాయతీ అవసరాల కోసంప్రభుత్వం ట్రాక్టర్లు మంజూరు చేసింది. గ్రామ పరిసరాల శుభ్రత కోసం ప్రజలకు చెత్త బుట్టలను అందజేసింది. చెత్తనుంచి ఎరువు తయారు చేయడానికి డ ంపింగ్ యార్డు నిర్మించింది ప్రభుత్వం చల్మెడలో నిర్మించిన డంపింగ్ యార్డులో వర్మీకంపోస్ట్తో ఎరువు తయారు చే యడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మాణం
చల్మెడలో రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టారు.ప్రతి రోజు ఉదయం పారిశుధ్య కార్మికులు గ్రామం లో ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి ట్రాక్టరులో డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అనంతరం తడి చెత్తను నీళ్లతో తడిపి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ కోసం వానపాములను వదులుతారు. క్రమేణా తడి చెత్త కంపోస్ట్ ఎరువుగా మారడంతో దానిని గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. అమ్మితే నెలకు రూ.12 వేలు ఆదాయం పంచాయతీకి వస్తుందని అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి
గత ప్రభుత్వాల పాలనతో గ్రా మాల్లో అభివృద్ధి కుట్టు పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డు నిర్మాణాలు పూరైయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో చెత్తను పారిశుధ్య కార్మికులకు అందజేస్తున్నా రు. – ఎంపీపీ సిద్ధిరాములు
అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తున్నారు
గ్రామ అభివృద్ధికి చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణంతో పారిశుధ్య సమస్య పరిష్కారమైంది. పం చాయతీ ద్వారా ఇంటింటికీ చెత్త బు ట్టలను అందజేశాం. తడి, పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని గ్రామస్తులకు సూచిస్తున్నాము. డంపింగ్ యార్డులో వేసిన తడి చెత్తతో ఎరువులను తయారు చేస్తున్నాం.
-గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి