పటాన్చెరు, ఏప్రిల్ 27 : పటాన్చెరు దవాఖానకు డయాగ్నోస్టిక్ మినీ హబ్ మంజూరయ్యిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానను ఎమ్మెల్యే సందర్శించారు. దవాఖాన సూపరింటెండెంట్ వసుంధరతో కలిసి డయాగ్నోస్టిక్ మినీ హబ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నదన్నారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయడంతోపాటు వైద్య పరీక్షలు కూడా చేసేందుకు తెలంగాణ సర్కారు కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పటాన్చెరు ఏరియా దవాఖానకు కొత్త పరీక్షా పరికరాలతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఆయన వెంట నాయకులు కంకర శ్రీను, విజయ్కుమార్, రాజు పాల్గొన్నారు.