నంగునూరు, ఏప్రిల్ 27 : కరోనా నుంచి సీఎం కేసీఆర్ కోలుకోవాలని నంగునూరు మండలం పాలమాకులలోని శంభుదేవాలయంలో చేస్తున్న జపాలు పూర్తయ్యాయని ద్వివేది జనమంచి సీతారామశర్మ అన్నారు. మంగళవారం ధన్వంతరి మహాయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామశర్మ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కరోనాను జయించాలని కోరుకుంటూ మహిమాన్వితమైన శివాలయంలో ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజలు చేశామన్నారు. వైదికులు జనమంచి చిత్తారిశర్మ, సుబ్రహ్మణ్యశర్మ, రక్షిత్శర్మ, లక్ష్మణశర్మ తదితరులు ఉన్నారు.