దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవార్లు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం మూడోరోజూ ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధిలో అమ్మవారు చంద్రగంటదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఝరాసంగం మండలంలోని సంగమేశ్వరాలయం, బొల్లారం మున్సిపల్ కేబీఆర్లోని భవానీ శంకరసాయి ఆలయం, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.
– సంగారెడ్డి, మెదక్ నెట్వర్క్, సెప్టెంబర్ 28
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు బుధవారం అమ్మవార్లు వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రగంటదేవీగా ఏడుపాయల వనదుర్గామాత, ‘కేతకీ’లో అన్నపూర్ణాదేవి గా దర్శనమిచ్చారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, హోమాలు నిర్వహించారు. బస్తీల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద నిర్వాహకులు భజన, భక్తి గీతాలు వంటి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు తమ కోరికలు తీర్చాలని వేడుకున్నారు.
బొల్లారం మున్సిపల్ కేబీఆర్లోని శ్రీ భవానీ శంకర సాయి సన్నిధి ఆలయంలో అమ్మవారు.. భక్తులకు శ్రీ గాయత్రీ దేవీగా దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
-బొల్లారం, సెప్టెంబర్ 28
కేతకీలో పార్వతీసమేత సంగమేశ్వరస్వామి ఆలయ మండపంలో అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. క్రీం(గంధం) చీరతో అలంకరణ చేసి అమ్మవారికి హోమం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-ఝరాసంగం,సెప్టెంబర్ 28
సదాశివపేట కన్యకాపరమేశ్వరీ ఆలయంలో గాయత్రిదేవీగా దర్శనమిస్తున్న అమ్మవారు.
-సదాశివపేట, సెప్టెంబర్ 28
బోరంచలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు.
-మనూరు, సెప్టెంబర్ 28
రాయికోడ్ శ్రీ ముమ్మాదేవి ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవీగా భక్తులకు దర్శనమిచ్చింది.
-రాయికోడ్, సెప్టెంబర్ 28
భెల్ కనకదుర్గాలయంలో లలితాదేవీగా దర్శనమిస్తున్న అమ్మవారు.
-రామచంద్రాపురం,సెప్టెంబర్28