పెద్దశంకరంపేట,అక్టోబర్17 : కన్న తండ్రిని హత్య చేసిన సంఘటనలో కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అల్లాదుర్గం సీఐ జార్జ్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 15 న రాత్రి 10గంటలకు పెద్దశంకరంపేట మండల పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన రోమాల సాయిలు(50)ను అతని మొదటి కుమారుడు అనిల్ మధ్యం మత్తులో తండ్రితో గొడవపడ్డాడు.
ఆవేశంలో రోకలితో తలపై బలంగా బాదడంతో పాటు తలుపుచెక్కపై తోసివేయడంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అనిల్ బయపడి అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులు 108కి సమాచారం అందించడంతో అంబులెన్స్ వచ్చి నప్పటికీ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారని వివరించారు. సమావేశంలో ఎస్ఐ నరేందర్, ట్రైనీ ఎస్ఐ దీక్షిత్రెడ్డి, పోలీసులు తదితరులున్నారు.