సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 10 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో ఉమ్మడి జిల్లాలో కసరత్తు మొదలైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పోస్టుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1138 అతిథి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనుండగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని 156 పోస్టుల్లోకి అతిథి అధ్యాపకులు రానున్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 66 పోస్టులు ఖాళీ ఉండగా, సంగారెడ్డి జిల్లాలో 64 పోస్టులు, మెదక్ జిల్లాలో 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అతిథి అధ్యాపకులు 2021-22 విద్యా సంవత్సరం చివరి వరకు విధుల్లో కొనసాగుతారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేపడుతున్న అతిథి అధ్యాపకుల నియామకాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకుల తరువాత విద్యా బోధన చేసేది అతిథి అధ్యాపకులు. గంటల ఆధారంగా పని చేసే అతిథి అధ్యాపకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో గతేడాది 44 మంది అతిథి అధ్యాపకులను నియామకం చేస్తే ఈ ఏడాది 64 పోస్టులు భర్తీ చేయడమే ఇందుకు నిదర్శనం. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కారణంగా విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల నిష్పత్తి ఆదారంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అతిథి అధ్యాపకులను నియమిస్తున్నది. వారం రోజుల్లోగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 16 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న 156 పోస్టులను భర్తీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 66 పోస్టులు సంగారెడ్డి జిల్లాలోని 7 కళాశాలల్లో 64 పోస్టులు, మెదక్ జిల్లాలోని 2 కళాశాలల్లో 26 పోస్టులు భర్తీ చేయనున్నారు.
కళాశాలల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి..
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7 పోస్టులు, దుబ్బాక కళాశాలలో 4, హుస్నాబాద్లో 2, సిద్దిపేట జీడీసీఏలో 32, సిద్దిపేట మహిళా కళాశాలలో 5, గజ్వేల్ జీడీసీఎంలో 4, గజ్వేల్ జీడీసీడబ్ల్యూలో 12 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట జీడీసీలో 6 పోస్టులు, నారాయణఖేడ్లో 5, పటాన్చెరులో 13, సదాశివపేటలో 4, జహీరాబాద్లో 4, సంగారెడ్డి జీడీసీఏలో 29, సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో 3 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో 6, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 20 పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు మూడు రోజుల్లో
అతిథి అధ్యాపకులు విధుల్లో చేరనుండడంతో ఉమ్మడి జిల్లాలోని 16 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
సంగారెడ్డి జిల్లాలో పూర్తైన అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూ..
అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ శుక్రవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 64 పోస్టుల భర్తీ కోసం డెమో, ఇంట ర్వ్యూలు నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా అతిథి అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సం గారెడ్డ్డి జిల్లాలో మొత్తం 64పోస్టులు ఖాళీ ఉండగా, అందు లో జోగిపేట కళాశాలకు సంబంధించి కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్లో 1 పోస్టు, ఇంగ్లిష్ 2, పొలిటికల్ సైన్స్లో 1, తెలుగు 2. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. నారాయణఖేడ్ కళాశాలలో కామర్స్ 2, కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్ 1, ఇంగ్లిష్ 1, హిస్టరీ 1 మొత్తం 5పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పటాన్చెరులో కామర్స్ 2, కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్లో 5 పోస్టు, ఇంగ్లిష్ 4, గణితం 1, తెలుగు 1 మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. సదాశివపేట కళాశాలలో కామర్స్ 1, కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్ 1 పోస్టు, పొలిటికల్ సైన్స్ 1, జూవాలజీ 1 మొత్తం 4 పోస్టులు. జహీరాబాద్ కళాశాలలో కామర్స్ 1, కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్ 1 పోస్టు, ఇంగ్లిష్ 2 పోస్టులు, సంగారెడ్డి జీడీసీఏలో బీబీఏ 2, కామర్స్ 7, కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్ 8 పోస్టు, డేటా సైన్స్ 1, ఇంగ్లిష్ 6, హిస్టరీ 1, గణితం 1, పొలిటికల్ సైన్స్ 1, స్టాటిస్టిక్స్ 1, తెలుగు 1 మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి మహి ళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంఫ్యూటర్ సైన్ అండ్ అప్లికేషన్స్ 1 పోస్టు, జూవాలజీ 1, తెలుగు 1 మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించిన డెమో, ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఫలితాలను రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
అతిథి అధ్యాపకుల నియామక నిబంధనలు ఇలా..
ఇదిలా ఉండగా, ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేపట్టనున్న అతిథి అధ్యాపక నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నారు. పీహెచ్డీ అభ్యర్థులు లేని పక్షంలో నెట్ లేదా సెట్ అర్హత కలిగిన అభ్యర్థులను నియమిస్తారు. వీరెవరూ లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా నియామక ప్రక్రియ కొనసాగనున్నది. త్రి సభ్య కమిటీలో సంబంధిత కళాశాల విషయ నిపుణుడు, ప్రిన్సిపాల్, జిల్లా ఐడీ కళాశాల ప్రిన్సిపాల్ ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు 2021-22 విద్యా సంవత్సరంలోని చివరి పని దినం వరకు బోధించాల్సి ఉంటుంది. అయితే కేవలం బయోమెట్రిక్, వర్క్డన్ ఆధారంగా వేతనాలను చెల్లిస్తామని, జీవో 54 ప్రకారం వేతనాలను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.