హవేళీఘనపూర్, జూన్ 30 : జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండల పరిధిలోని కూచన్పల్లి గ్రామ శివారులో నిర్మించిన చెక్డ్యామ్ను జలశక్తి అభియాన్ బృందం సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర బృందం సభ్యులు ఆవ్కిప్, టెక్నీకల్ సైంటిస్టు యూబీ పాటీల్లకు మెదక్ డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు చెక్డ్యామ్ నిర్మాణం, అందుతున్న ఫలాలను గురించి వివరించారు. వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి సాగుకు వినియోగిస్తున్న తీరును చూసి కేంద్ర బృందం అభినందించినట్లు పీడీ తెలిపారు.
కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, గ్రామ సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, ఏపీవో రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.