పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్ఐ సురేశ్ బందోబస్తు చర్యలు చేపట్టారు.