మెదక్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కొంపల్లిలోని ఆమె నివాసంలో నిజాంపేట మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి, టీఆర్ఎస్వీ మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్గౌడ్, నిజాంపేట యూత్ మండల అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకరాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.