మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,
7 నుంచి 10వ తరగతుల ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు http://telangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవా లని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, అదే విధంగా ప్రతి విద్యార్థి మాస్క్తో పాటు శానిటైజర్ వెంట తెచ్చుకోవాలన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఆదర్శ పాఠశాల తిరుమలపూర్, చిన్నశంకరంపేట మండలం 83 ఆదర్శ పాఠశాల రేగోడ్ 144 ఆదర్శ పాఠశాల టేక్మాల్ 141 ఆదర్శ పాఠశాల కోమట్పల్లి, రామాయంపేట మండలం 140 ఆదర్శ పాఠశాల వడియారం, చేగుటం మండలం 124 ఆదర్శ పాఠశాల, పెద్ద శంకరంపేట 123 ఆదర్శ పాఠశాల జక్కపల్లి, నర్సాపూర్ మండలం 200