మనోహరాబాద్ : ద్విచక్ర వాహనాన్ని టాటా ఎస్ వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
ఎస్ఐ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన సోమసాని లక్ష్మణ్ (22) తన స్నేహితుడు కమ్మరి అనిల్తో కలిసి ద్విచక్ర వాహనంపై దొంతి నుంచి శివ్వంపేటకు వెళ్తున్నాడు. శివ్వంపేట గ్రామ శివారులోని రాజన్నవాగు వద్దకు రాగానే వీరి బైక్ను టాటా ఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిల్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికాంత్ తెలిపారు.