హుస్నాబాద్, జూలై 29 : అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి కొత్త రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదిం టి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ రేషన్కార్డులు ఇచ్చి పేదల ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని 161 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ మానస, తహసీల్దార్ అబ్దుల్ రహమాన్, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ భూములు బంగారం..
కోహెడ, జూలై 29 : తెలంగాణ భూములు బంగారమని, ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో రైతులు నష్టపోయారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులతోపాటు 399 మందికి మంజూరైన కొత్త రేషన్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువుల పంపిణీ చేయటంతో తెలంగాణలో బంగారు పంటలు పండుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల రాధమ్మ, తహసీల్దార్ రుక్మిణి, ఎంపీడీవో శ్రీధర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పేర్యాల నవ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు శేఖర్, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.