వెంచర్లలోనూ మొక్కలు నాటాల్సిందే
అదనపు కలెక్టర్ ఆకస్మిక పర్యటన
రామాయంపేటలోని వార్డుల్లో మొక్కలను పరిశీలించిన జిల్లా అధికారి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్కు ప్రతిమాసింగ్ సూచన
రామాయంపేట, జూలై 28: హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం చేయొద్దని, నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం రామాయంపేటకు ఆకస్మికంగా విచ్చేసిన ఆమె పట్టణంలోని వివిధ వార్డులు, ప్రైవేట్గా ఉన్న వెంచర్లను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామాయంపేట మున్సిపల్వ్యాప్తంగా కోమటిపల్లి, గొల్పర్తి, కోమటిపల్లి గిరిజన తండాల్లో సైతం రోడ్డుకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుత సీజన్లో ప్రజలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, దోమలు, ఈగల నివారణకు హైపొక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి గల్లీలో పిచికారీ చేయాలన్నారు. ప్రతిరోజు కమిషనర్, ఇతర సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తు ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది నవాత్ ప్రసాద్, వెల్ముల శ్రీనివాస్, పోచమ్మల నరేశ్, చిలుక కృష్ణ, ఉన్నారు.