సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు
ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వెల్లడి
గజ్వేల్, జూలై 21 : యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని యాదవ సంఘం నాయకులు అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో యూనిట్కు రూ.లక్షా 75 వేలకు పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తూ అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్రలో గొల్లకుర్మల గురించి ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం కేసీఆర్ మొదటి విడుత రూ.లక్షా 25 వేల చొప్పున గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొండపాక మండలం నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. రెండో విడుతలో యూనిట్ విలువను లక్షా 75 వేలకు పెంచడంతో యాదవులంతా సం తోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం యాదవ సంఘం నాయకులంతా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్గల్ జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, నాయకులు మల్లేశంయాదవ్, ఎంబరి రాంచంద్రం, గజ్వేల్, ములుగు, మర్కూ క్, కొండపాక మండలాల యాదవ సంఘాల అధ్యక్షులు కన్నా యాదవ్, ఐలేశ్యాదవ్, కొమురయ్యయాదవ్, అనంతరావుపల్లి మాజీ సర్పంచ్ కొమురయ్య యాదవ్, కొండపోచమ్మ డైరెక్టర్ వెంకటేశ్యాదవ్, నాయకులు ఆంజనేయులు, రాజమల్లు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు షనర్థి..
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 21 : గొర్రెల పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ఒక్కో యూనిట్ విలువను రూ.లక్షా 25 వేల నుంచి రూ.లక్షా 75 వేలకు పెంచడంతో కుర్మలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కురుమలపై ఉన్న ప్రేమను మరోసారి చాటినందుకు షనర్థులు తెలిపారు. ఈ మేరకు బుధవారం కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పానగేశ్ మాట్లాడూతూ సీఎం కేసీఆర్ గొల్ల, కుర్మలపై ఎంతో ప్రేమతో గొర్రెల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ పథకం యూనిట్ విలువను మరో రూ.50 వేలు పెంచి యూనిట్ ధరను రూ.లక్షా 75 వేలు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేశారని తెలిపారు. కుర్మల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చి తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పారు. కోకాపేటలో దాదాపు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు సంక్షేమ భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ నిర్మాణం కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్కు గొల్ల, కుర్మలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షీసాయికుమార్, కుర్మ సంఘం నాయకులు బీరయ్య, ఈశ్వరయ్య, శ్రీహరి, కాల్వగడ్డ మల్లయ్య, పెద్దగొల్ల నగేశ్, భూమయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గొల్ల, కుర్మల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్
హుస్నాబాద్ టౌన్, జూలై 21 : సీఎం కేసీఆర్ గొల్ల, కుర్మలకు ఆరాధ్య దైవంగా మారారని హుస్నాబాద్ గొల్ల, కుర్మ సంఘం నాయకులు అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.11,000 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం హు స్నాబాద్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గొల్ల, కుర్మ సంఘం నాయకులు గడ్డం కొమురయ్య, గొర్ల కొమురయ్య, చెన్నవేని దేవేందర్, మ్యాకల ఓదయ్య మాట్లాడుతూ గొల్ల, కుర్మల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గొర్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మరిన్ని గొర్రెలను అం దిస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దొంతరబోయిన ప్రభాకర్, కోట అశోక్, పోతరవేని బాలయ్య, మ్యాకల రమేశ్, వట్టే మల్లేశ్, మ్యాకల ఐలయ్య, పెద్ది ఎల్లయ్య, దొంతరబోయిన రాజు, బక్కయ్య, పెద్ది వెంకటయ్య, సాంబరాజు పాల్గొన్నారు.