మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు
మెదక్, మున్సిపాలిటీ జూలై 21: బక్రీద్ పండుగను జిల్లా వ్యాప్తంగా బుధవారం ముస్లింలు భక్తిశ్రద్ధ్ధలతో జరుపుకొన్నారు. మెదక్లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేయడానికి వీలు లేకపోవడంతో మసీదుల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.మసీదుల్లో జరిగిన ప్రార్థ్ధనల్లో ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఖాజా మోహినోద్దీన్, ప్రధాన కార్యదర్శి నయిమోద్దీన్ సభ్యులు ఆరీఫ్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ సమియోద్దీన్ మాజీ కౌన్సిలర్లు గౌస్ఖురేషి , మున్నా, సాధిక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజీ బ్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో మసీద్ల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. బక్రీద్ను పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్ ముస్లింలకు ఈద్ముబారక్ తెలిపారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట,జూలై 21:పెద్దశంకరంపేట పట్టణంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మెదక్రూరల్లో….
మెదక్రూరల్, జూలై 21: మెదక్ మండలంలో బక్రీద్ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు పండుగను పురస్కరించుకొని మసీద్లు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
పాపన్నపేటలో…
పాపన్నపేట,21జూలై: మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొన్నా రు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
చిన్నశంకరంపేటలో…
చిన్నశంకరంపేట,జూలై 21: మండలంలోని వివిధ గ్రామా ల్లో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.