హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగ నిరతి అద్భుతమైనవని చెప్పారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.
‘అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనాపై పోరాటంలో మన డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతు సైనికుల్లా పనిచేస్తూన్న వైద్యులందరికి.. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వీరికి అండగా ఉండటం మన బాధ్యత’ అని మంత్రి హరీశ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.