సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రిజర్వ్ డే రోజు తొలి సెషన్లో కివీస్ బౌలర్లు అదరగొడుతున్నారు. 15 పరుగులు చేసిన అజింక్య రహానే.. బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో ఇండియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఇండియా కేవలం 79 రన్స్ ఆధిక్యంలో మాత్రమే ఉంది. రిషబ్ పంత్ 21 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ఇవాళ ఉదయం కోహ్లీ 13, పురాజా 15 రన్స్ చేసి త్వరత్వరగా ఔటయ్యాడు. తాజా సమాచారం అందే వరకు ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో అయిదు వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది.