పూర్తిస్థాయిలో శానిటైజేషన్ పనులు

డీఈవో రమేశ్కుమార్- పాఠశాలలను తనిఖీ-రికార్డులు పరిశీలన
కొల్చారం, జనవరి 25 : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున పూర్తి స్థాయిల్లో శానిటైజేషన్ పనులు చేపట్టామని డీఈవో రమేశ్కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వరిగుంతం, అంసాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల్లో శానిటైజేషన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
రాయిలాపూర్ పాఠశాలలో రికార్డులు పరిశీలన
కౌడిపల్లి, జనవరి 25 : మండల పరిధిలోని రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాలను డీఈవో రమేశ్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పాఠశాలలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి
- ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..
- గులాబీమయమైన దొంగలమర్రి..
- ప్రభాస్ రికార్డు..సినిమాకు 100 కోట్ల పారితోషికం..!