వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య
వికారాబాద్, జూన్ 19 : నర్సరీలలో మొక్కల పెంపకంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని నర్సరీని పరిశీలించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. హరిత హారం ప్రారంభం నాటికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో పూల మొక్కలతో పాటు ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కూడా నాటాలని వివరించారు. అధనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.