వనస్థలిపురం, జూన్ 18: కాలనీల్లో ఉన్న ఓపెన్ స్థలాలను పరిరక్షించుకొని, ప్రజావసరాలకు వినియోగించుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఎన్రెడ్డినగర్ డివిజన్ ఆకస్మిక పర్యటన చేపట్టారు. అనంతవేణి కాలనీలో ఉన్న మూడు ఖాళీ స్థలాల్లో పార్కులు నిర్మించేందుకు రూ.57లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. పార్కులు ఆరోగ్యాన్ని పంచుతాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సాగర్ కాంప్లెక్స్ కాలనీలో పర్యటించారు. రూ.80లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దృష్టిపెట్టి శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, తిరుమలేశ్, కృష్ణారెడ్డి, నర్సింహ, శ్రీనివాస్, రాఘవేందర్రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.