హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటకు అమెరికాలో బాలు జయంతి సందర్భంగా పట్టాభిషేకం జరుగనున్నది. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్, శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75 వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75 పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం జరుగనున్నది. ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 :00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
సంతోష్ ఫిలిం న్యూస్, ట్రైనెట్, తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు, మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర ,సిరాశ్రీ రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి, సురేష్ కొండేటి, ఒమన్ నుంచి అనిల్ కుమార్ కడించెర్ల, హరి వేణుగోపాల్ పాల్గొంటున్నారు. గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం శ్రీ సాందీప్, పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్ బాలు గారి 75 పాటలను వినిపిస్తారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత