కన్నుల్లో నీ రూపమే చిత్రాన్ని తెరకెక్కించిన ఇరసవడ్ల బిక్షపతి(41) కన్నుమూశారు.
ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన బిక్షపతి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగరీత్యా దాదాపు 36 దేశాల్లో పని చేశారు. అనంతరం సినిమా మీద ఉన్న ఆసక్తితో కన్నుల్లో నీ రూపమే అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
ఆ సినిమా కథాపరంగా బాగున్న అంతగా ఆడకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత దేవగిరి పట్నంలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల నుండి అప్పుల బాధతో బాధపడుతూ ఆరోగ్యంను సరిగా పట్టించుకోలేదు. శనివారం బిక్షపతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా..గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!