యాదగిరిగుట్ట రూరల్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వైరస్ను ప్రాథమిక దశలోనే గుర్తించేందు కు చేపట్టిన రెండో విడుత జ్వర సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. సోమవారం వంగపల్లి గ్రామంలో జరుగుతున్న జ్వర సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి మందుల కిట్లను అందజేయాలని వైద్య సిబ్బంది కి సూచించారు. దీంతోపాటు వారికి ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టేవరకు ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రజలు కొవిడ్ వైరస్పై అప్రమత్తంగా ఉండాలని, మా స్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. నర్సరీలో మొక్కలు బాగున్నాయని అన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఇంకా ఎంత ధాన్యం మిగిలి ఉందని అడుగగా.. ఇంకా 20 లా రీల వడ్లు మిగిలి ఉన్నాయని సంబంధిత శాఖ ఉద్యోగులు కలెక్టర్కు తెలిపారు. లారీల సమస్య ను వెంటనే పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ స్వామి ఉన్నారు.
బీబీనగర్, మే 24: ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే రెండో రోజూ మండలంలో కొనసాగింది. సోమవారం మండలం వ్యాప్తంగా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందుల కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ ప్రవీణ్కుమార్, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
చౌటుప్పల్, మే24: మున్సిపాలిటీ పరిధిలో రెండో విడుత జ్వర సర్వే సోమవారం ప్రారంభమైంది. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇం టింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లను అందజేశారు.
ఆత్మకూరు(ఎం), మే 24: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వేను ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు చేపట్టారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారిని గుర్తించి పేర్లు నమో దు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్లు సుమతి, నర్సింహారెడ్డి, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
రాజాపేట, మే 24: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రెండో విడుత జ్వరం సర్వే కొనసాగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికెళ్లి జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి శివవర్మ పర్యవేక్షించారు.
ఆలేరురూరల్, మే24 : రెండో విడుత జ్వర సర్వే మండల వ్యాప్తంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు ఇం టింటికెళ్లి సర్వే చేపడుతున్నారు. జలుబుతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేశారు.
యాదాద్రి, మే24: ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత జ్వర సర్వే సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో కొనసాగింది. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. అవసర మైన వారికి మందులను అందజేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లిలో 20 ఇండ్లల్లో 82 మంది వివరాలు సేకరించామని ఆశ వర్కర్ వెంకటమ్మ తెలిపారు.
మోటకొండూర్లో..
మోటకొండూర్ మండలంలో రెండోవిడుత జర్వ సర్వే విజయవంతంగా సాగుతున్నది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నా రు. మోటకొండూర్ మండల కేంద్రంలో ఆశ వర్కర్లు కవిత, మమత ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. 215 ఇండ్లల్లో 873 మంది వివరాలు సేకరించి, ఇద్దరు వ్యక్తులకు తలనొప్పి, జలుబు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
n వలిగొండ, మే 24: మండలంలోని అన్ని గ్రా మాల్లో రెండో విడుత జ్వర సర్వేను ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, పంచాయ తీ కార్యదర్శులు సోమవారం నిర్వహించారు. 40 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన ఇంటింటి సర్వేలో 3,424 ఇండ్లకు వెళ్లి 103 మందిలో స్వల్ప జ్వరం లక్షణాలను గుర్తించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 38 మందికి మెడికల్ కిట్లను అందజేసినట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
మోత్కూరు, మే 24 : రెండు రోజులుగా నిర్వహించిన జ్వర సర్వే మండల, మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ముగిసిందని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. జ్వరం జలుబు, ఇతర లక్షణాలు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం పంపిణీ చేసిన మెడికల్ కిట్లను అందజేశామన్నారు. పీహెచ్సీలో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షలకు వైద్యులు సూచించిన వారు మాత్రమే రావాలని, ర్యాపిడ్ పరీక్ష చేయించుకున్న వారు పాజిటివ్గా నిర్థారణ అయితే తిరిగి 18 రోజుల తర్వాత పరీక్షలకు రావాలని సూచించారు.
రామన్నపేట, మే24: రెండో విడత జ్వర సర్వే ను సోమవారం మండలంలో వైద్యసిబ్బంది ఇం టింటికీ తిరిగి నిర్వహించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి మందులను అందజేసి పలు సూచనలు చేశారు. ఈ సర్వేను మండల వైద్యాధికారి రవికుమార్ పర్యవేక్షించారు.
మోత్కూరు (గుండాల), మే 24 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కొవిడ్ నియంత్రణ- జ్వర సర్వే అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామా ల్లో వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికీ తిరిగి నిర్వహిస్తున్న సర్వేకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ స భ్యుడు ఖలీల్, తహసీల్దార్ దయాకర్రెడ్డి , సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, మే24: రెండో విడుత జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు అల్లందేవిచెరువు, సర్వేల్, కంకణాలగూడెం, గుడిమల్కాపురం గ్రామాల్లో జరుగుతున్న జ్వర సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వైద్యసిబ్బంది ,ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే మందులు అం దజేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చేపడుతున్న పారిశుధ్య పనులను మండల వైద్యాధికారి దీప్తిను అడిగి ఆయన తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి గౌడ్, సర్పంచ్లు శ్రీహరి, యాదయ్యగౌడ్, భిక్షపతి, పుష్పలత పాల్గొన్నారు.