అలహాబాద్: కరోనా కల్లోలంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు తీరుపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాం భరోసే (అంతా ఆ దేవుని దయ) అన్న పరిస్థితి రాష్టంరోల నెలకొన్నదని న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్తో కూడిన ధర్మాసనం రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జిల్లా ఆస్పత్రిలో రోగి అదృశ్యం కావడంపై ముగ్గుర సభ్యుల కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి “రాం భరోసే” అన్నట్టుగా తయారైందని మండిపడింది. మీరట్ ఆస్పత్రిలో సంతోష్ కుమార్ అనే రోగిని అడ్మిట్ చేసుకున్నారు. అతడు రెస్ట్ రూంలోనే కుప్పకూలాడు. ఆ తర్వాతే అతడిని స్ట్రెచర్ పై లోపలకు తెచ్చి ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. కానీ అతడు మరణించాడు. డాక్టర్లు అతడిని గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేసి శవాన్ని వదిలించుకున్నారు. ఆరోజు రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ల ప్రవర్తన నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. మొత్తంగా రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ మరీ సుకుమారంగా, పనిచేయలేని స్థితిలో ఉందని కోర్టు అక్షింతలు వేసింది. పైగా రాష్ట్ర వ్యాపర్తంగా వైద్య సౌకర్యాలు అరకొరగా, జనాభాకు ఏమాత్రం సరిపోయేలా లేవని కూడా కోర్టు తెలిపింది.