చర్లపల్లి, మే 10 : నియోజకవర్గం పరిధిలోని ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి, వెంకటరెడ్డినగర్, మధుసూదన్రెడ్డినగర్లో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్లపల్లి డివిజన్ పరిధిలోని వెంకటరెడ్డినగర్, మధుసూదన్రెడ్డినగర్ కాలనీల్లో పార్కులకు సంబంధించిన కొంత స్థలం కబ్జాకు గురైనట్లు కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. కబ్జాకు గురైన పార్కు స్థలాల పరిరక్షణ కోసం తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పార్కు స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించి, త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై శ్రీనివాస్, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జాండ్ల ప్రభాకర్రెడ్డి, సర్ఫ్రాజ్, గిరిక సుధాకర్, శ్రీకాంత్యాదవ్, కాలనీ అధ్యక్షుడు ఈగ పాండు, మొగిలి పెంటేశ్, శివారెడ్డి, మురళి, మల్లేశ్, సత్తయ్య, కృష్ణ, వెంకటేశ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
నియోజవవర్గం పరిధిలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి ముస్లిం బస్తీలోని మహ్మదీయ ఈ మసీద్లో మైనార్టీ నాయకుడు స్వర్ఫ్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రభుత్వం అందజేసే రంజాన్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై శ్రీనివాస్, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్రెడ్డి, గరిక సుధాకర్, ఈగ పాండు, పెంటేశ్, శివారెడ్డి, మురళి, మసీద్ కమిటీ సభ్యులు మమ్మద్ సర్ఫ్రాజ్, మహ్మద్ సత్తార్, సయ్యద్ సులేమాన్, మహ్మద్ షాహనాజ్, మహ్మద్ అన్వర్, మహ్మద్ ఇస్మాయిల్, ఎండీ యూనిస్, సయ్యద్ సోహైల్లతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, మే 10 : ప్రజల్లో సేవా భావం పెంపొందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ, పేద, మధ్య తరగతి ప్రజలకు చేయూతనందించాలని తెలిపారు. చిలుకానగర్ డివిజన్ రాఘవేంద్రనగర్కు చెందిన వికలాంగుడికి సోమవారం చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వీల్చైర్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగులకు వీల్చైర్ అందజేస్తూ, వారి సంక్షేమానికి కృషిచేయడం అభినందనీయమన్నారు. అనంతరం బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేతలు పల్లె నర్సింగ్రావు, గరిక సుధాకర్, లింగనాయక్, జగన్, పుష్పరాజు, శ్రీకాంత్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.