నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 10: బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో సోమవారం పలువురికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 95 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 24 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించడంతోపాటు మెడికల్ కిట్లు అందజేశామని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామని వైద్యసిబ్బంది తెలిపారు. ఎడపల్లి పీహెచ్సీలో 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి వెల్లడించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రెండు వందల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు. కోవాగ్జిన్ ప్రభుత్వ దవాఖానకు సరఫరా కాగా, రెండో విడుత వ్యాక్సినేషన్ చేపట్టినట్లు ఆమె వివరించారు.
బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. సోమవారం 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. 81 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో సోమవారం 49 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. 49 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేశామని డాక్టర్ రవికుమార్ తెలిపారు. చౌట్పల్లి పీహెచ్సీలో 35 మందికి కొవిడ్ టెస్ట్లు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని, 60 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేశామని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 21 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు.
ఆర్మూర్ ఏరియా దవాఖాన లో 50 మందికి పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ తెలిపారు. మాక్లూర్ మండలంలోని మాక్లూర్, కల్లడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. మాక్లూర్లో 48 మందికి టెస్టులు నిర్వహించగా 10 మందికి, కల్లడిలో 39 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం 32 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రఘువీర్ తెలిపారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 36 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ దిలీప్ తెలిపారు. మండల కేంద్రంలో ఇద్దరికి, అంబం గ్రామంలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో 42మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. 27 మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శుభాకర్ తెలిపారు.
40 మంది కొవిడ్ టీకా తీసుకున్నారని పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 40 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. 55 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో సోమవారం 40మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 78 మందికి రెండో విడుత వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. మోస్రా మండల కేంద్రంలో 42 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు.
వర్ని మండలంలోని పైడిమల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సోమవారం వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో రెండో విడుత కొవిడ్ టీకా వేసుకున్నారు. కోటగిరి మరడలంలోని పొతంగల్, కోటగిరి ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. కోటగిరిలో తొమ్మిది మందికి, పొతంగల్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాపురావు తెలిపారు. వంద మందికి రెండో డోస్ టీకా వేసినట్లు పేర్కొన్నారు.