బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సోమవారం (మే 10) నుంచి మే 24 వరకు రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ విధించింది. అంటే రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మార్కెట్లు, నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించిన దుకణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏ నిత్యావసరాల దుకాణం దగ్గర చూసినా జనం భారీ క్యూలైన్లలో నిలబడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. హుబ్లీ మార్కెట్లో జనం రద్దీకి సంబంధించిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.