యాదాద్రి, మే7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం చైత్రబహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా వైభవంగా జరిగాయి. స్వా మి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. కొవిడ్ బారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు ప్రత్యేక సుదర్శన నారసింహహోమం నిర్వహించి వేడుకున్నామని ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
శాస్ర్తోక్తంగా లక్ష్మీపూజలు
స్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం బాలాలయంలో కవచమూర్తులను సువర్ణాపుష్పాలతో అర్చించి, వేదమంత్రాలతో అభిషేకించారు. తులసీదళాలు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉం చి అర్చన జరిపారు. సాయంత్రం వేళ బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాల మధ్య ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలాలయ ముఖ మం డపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడు తూ లాలిపాటల కోలాహలం సాగింది. స్వామివారి బాలాలయంలో లక్ష్మీనృసింహులను దివ్యమహోహరం గా అలకరించి తిరు నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు.
మొదటగా సుదర్శన నారసింహ హోమం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి వారికి రోజువారీ నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. వేకువజామూన సుప్రభాతంతో ఆరంభించిన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవాలతో ముగిశాయి. మం డపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసి దళాలతో అర్పించారు. ఆలయంలో అష్టోత్తరం, సువర్ణాపుష్పార్చనలు కొనసాగాయి. యాదాద్రి కొండ కింద గల తులసీవనం వద్ద గల శిల్పారామంలో భక్తులు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతమాచరించి కొం డపైకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించున్నారు.
ఖజానాకు రూ.1,54,150 ఆదాయం
లక్ష్మీనరసింహ స్వామివారికి రూ. 1,54,150 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.7,114, రూ.100 దర్శనాలతో రూ.1,900, కైంకర్యాల ద్వారా రూ.2,116, సుప్రభాతంతో రూ. 200, క్యారీ బ్యాగులతో రూ.550, వ్రతాలతో రూ.4,000, కల్యాణకట్టతో రూ. 4,000, ప్రసాద విక్రయాలతో రూ. 62,600, వాహనపూజలతో రూ.2,500, టోల్గేట్ ద్వారా రూ. 550, అన్నదాన విరాళంతో రూ.300, సువర్ణపుష్పార్చనతో రూ. 13,400, యాదరుషి నిలయంతో రూ. 14,200, శివాలయం ద్వారా రూ. 800, పాతగుట్ట తో రూ. 4,920, టెంకాయ విక్రయాల ద్వారా రూ. 7,020, ఇతర విభాగాలతో రూ. 27,980తో కలిపి స్వామివారికి రూ. 1,54,150 ఆదాయం సమకూరింది.
నేడు యాదాద్రికి మండలి డిప్యూటీ చైర్మన్..
లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం యాదాద్రికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు కొండపైన గల హరితహోటల్కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం స్వా మివారిని దర్శించుకుని, మున్నూరుకాపు భవన్లో జరిగే హోమంలో పాల్గొననున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, మ ధ్యాహ్నం తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.