న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వరుసగా మూడు రోజుల పాటు 400కు పైగా కరోనా మరణాలు నమోదైన అనంతరం బుధవారం మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా 448, 407, 412 మరణాలు నమోదవగా బుధవారం మరణాల సంఖ్య 311కి తగ్గడం అధికారులకు ఉపశమనం కలిగించింది.
ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 20,960 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివిటీ రేటు 30 శాతం దిగువకు పడిపోయినా ఇప్పటికీ 26.37 శాతం ఉండటం కొంత కలవరం క లిగిస్తోంది. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,53,902కు ఎగబాకింది. వీరిలో 11.43 లక్షల మంది కోలుకోగా 18,603 మంది ప్రాణాలు కోల్పోయారు.