న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వికాస్పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోమ్లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో 17 కొవిడ్ రోగులతో సహా మొత్తం 26 మందిని రక్షించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్డ్ తెలిపారు. ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని, ఎనిమిది ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి తరలించి గంటలోపే మంటలు అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది సహాయంతో రోగులందరినీ రక్షించామని, వారంతా సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. రోగులను దగ్గరలోని ఇతర దవాఖానలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న మంటలు చెలరేగాయని సమాచారం. షార్ట్ సర్క్యూట్తోనే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం పొగ వ్యాపించింది. హాస్పిటల్లో ఉన్న రోగులకు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.