కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులని సైతం కలవరపరుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కరోనా సోకుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రీసెంట్గా అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
అల్లు అర్జున్కు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన ఫ్యామిలీ సభ్యులు అందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అల్లు శిరీష్ అయితే రెండు సార్లు పరీక్ష చేయించుకున్నారు. గురువారం, శుక్రవారం టెస్ట్ చేయించుకోగా, తనకు నెగెటివ్ రిజల్ట్ వచ్చిందని స్పష్టం చేశారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులని కలిసి ఉండొచ్చనే కారణంతో నాకు నేనుగా రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నాను. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
ఇవికూడా చదవండి..