అహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తుగా ఓడించింది. కోల్కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పృథ్వీ షా(82: 41 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు అర్ధశతకానికి తోడు శిఖర్ ధావన్(46: 47 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో ఢిల్లీ అలవోకగా గెలిచింది. కోల్కతా బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు కోల్కతా ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(43: 38 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(45 నాటౌట్: 27 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నితీశ్ రాణా(15), రాహుల్ త్రిపాఠి(19), మోర్గాన్(0), సునీల్ నరైన్(0), దినేశ్ కార్తీక్(14) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.