నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను జిల్లావ్యాప్తంగా మంగళవారం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ ఆవశ్యకత, తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు పార్టీ పాత్ర, స్వరాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పాలన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధినేత, ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, అమలుచేస్తున సంక్షేమ పథకాలను వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని వెన్నంటే ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.బోధన్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ పతాకాన్ని టీఆర్ఎస్ బోధన్ పట్టణ నాయకులు వెంకటేశ్వరరావు దేశాయ్, తూము శరత్రెడ్డి, పిల్లకుంట్ల గంగాధర్గౌడ్, జాడె సతీశ్ ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ తదితరులు ఆవిష్కరించారు.
శక్కర్నగర్లో టీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎంఏ రజాక్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. చందూర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అంబర్సింగ్, లక్ష్మాపూర్లో సర్పంచ్ సత్యనారాయణ, వర్నిలో పార్టీ మండల అధ్యక్షుడు కల్లాలి గిరి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కోటగిరిలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జడ్పీటీసీ శంకర్పటేల్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు. నవీపేటలో పార్టీ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు. ఎడపల్లిలో పార్టీ మండల అధ్యక్షుడు న్యావనంది సుభాష్ స్థానిక నాయకులతో కలిసి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
డిచ్పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, పార్టీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొరట్పల్లి అమరవీరుల స్తూపం వద్ద పార్టీ జెండాను టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆశన్న ఆవిష్కరించారు. ఇందల్వాయిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంపీపీ రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యమకారులకు నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలంలోని కాలూర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కె సంతోష్, సీనియర్ నాయకుడు మీసాల మధుకర్రావు, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్ నగేశ్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంపై ఆయన తనయుడు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
జక్రాన్పల్లిలో పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ డీకొండ హరిత, వైస్ ఎంపీపీ విమల తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలం సిర్పూర్లో టీఆర్ఎస్ జెండాను పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంరెడ్డి ఆవిష్కరించారు. ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ టీఆర్ఎస్ నాయకుడు పండిత్ ప్రేమ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. నందిపేట్లో మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, నాయకులతో కలిసి జెండాను ఎగురవేశారు. భీమ్గల్లో పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్, రైతు బంధు మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఆత్మ కమిటీ సభ్యుడు రవీందర్, ఎంపీటీసీ మహేశ్, నాయకులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో పార్టీ మండల యూత్ అధ్యక్షుడు విఘ్నేశ్ గౌడ్ తన ఇంటిపై జెండాను ఆవిష్కరించారు. రెంజర్లలో గ్రామ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ తదితరులు జెండాను ఎగురవేశారు.