న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ)ను టేకోవర్ చేసుకోవడానికి ఫైనాన్సియల్ బిడ్ దాఖలు చేసేందుకు గడువు పెంచాలని కేంద్రాన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ కోరారు. వ్యక్తిగత హోదాలో ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్ దాఖలు చేశారాయన.
అదే సమయంలో వర్చువల్ డేటా రూమ్ (వీడీఆర్) వివరాలు వెల్లడించడానికి నిబంధనలు సడలించాలని అజయ్ సింగ్ కోరారు. క్లీన్ టీమ్ ప్రొటోకాల్ కింద ఈ నిబంధనలను సడలించాలని అభ్యర్థించారని సమాచారం. తొలుత వ్యక్తిగత హోదాలో బిడ్ దాఖలు చేసిన అజయ్ సింగ్.. తర్వాత కన్సార్టియంగా ఏర్పడ్డారు.
సున్నితమైన ఎయిర్ ఇండియా అంతర్గత పత్రాలు అంటే.. ఆ సంస్థ వాణిజ్య కార్యక్రమాలు, ఫైనాన్సియల్ అండ్ ఆపరేషనల్ అంచనాల గురించి థర్డ్ పార్టీతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది కేంద్రం. ఎయిర్ ఇండియా వీడీఆర్ డేటా వివరాలు వెల్లడించడానికి అనుమతించకపోతే, తనకు ప్రతికూల పరిస్థితులు (నష్టం) తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.
రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) విడుదల చేయడానికి ముందు ఫైనాన్సియల్ బిడ్స్ దాఖలు చేయడానికి 12 వారాల ముందు గడువు పొడిగించాలని అజయ్ సింగ్ అభ్యర్థించారు. కొవిడ్-19 రెండో వేవ్ నేపథ్యంలో వీడీఆర్ డాక్యుమెంటేషన్ పూర్తి కాకపోతే ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలని కోరారని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా (ఏఐ)ని ప్రైవేటీకరించడానికి గతేడాది జనవరి 27న ప్రక్రియ ప్రారంభించింది. నాడే సంస్థలో వాటాల విక్రయానికి సంబంధించి కేంద్రం ప్రాథమిక ప్రకటన చేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ఎర్నెస్ట్ అండ్ యంగ్.. ట్రాన్సాక్షన్ సలహాదారుగా వ్యవహరిస్తున్నది.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్కు చోటా రాజన్ తరలింపు
తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి