పర్వతగిరి, ఏప్రిల్ 25 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని సర్పంచ్లు గటిక సుష్మ, వర్కాల రమేశ్ తెలిపారు. ఆదివారం మండలంలోని చింతనెక్కొండ, కొంకపాక గ్రామాల్లో ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవనోపాధి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న టీచర్లను సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు దేవేందర్, రంజిత్, ఎంపీటీసీ మోహన్రావు, పీఏసీఎస్ వైస్చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్రావు, డీలర్ శంకర్, ప్రైవేట్ టీచర్లు పాల్గొన్నారు.
నర్సంపేటలో బియ్యం అందజేత
నర్సంపేట రూరల్ : మండలంలోని గురిజాల గ్రామంలో పలువురు ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యాన్ని ఎంపీటీసీ బండారు శ్రీలత, టీఆర్ఎస్ మండల నాయకుడు బండారు రమేశ్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సన్నబియ్యం, రూ. 2వేలు అందజేస్తోందన్నారు. వీటిని లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు. వార్డు సభ్యుడు పొదిల కుమారస్వామి, ఉపాధ్యాయులు మెట్టు రమేశ్, దాస్యం రూప, దాస్యం రంగనాథస్వామి, డీలర్, టీఆర్ఎస్ నాయకులు అల్లి రవి, రాజ్కుమార్, రాజు పాల్గొన్నారు.