దేశంలో ఎక్కడాలేని విధంగా పూర్తి కృష్ణశిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి దివ్యక్షేత్రం హరితశోభను సంతరించుకున్నది. యాదాద్రి కొండచుట్టూ ఎటుచూసినా పచ్చటి పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైటీడీఏ అధికారులు కొండ చుట్టూ దాదాపు 108 రకాల మొక్కలు నాటారు. ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూలు, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు, రాశి, నక్షత్ర వనాలతో కొండంతా పచ్చదనం పరుచుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
కరోనా కట్టడికి స్పైడర్మ్యాన్ ఫైట్