ఆరువేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకర్ రాక
కొవిడ్ బాధితులకుఉత్తమ చికిత్స
అందుబాటులో బెడ్స్, ఇంజెక్షన్లు : డైరెక్టర్ బలరాం నాయక్
ఎదులాపురం, ఏప్రిల్ 23 : దేశంలోని పలు రాష్ర్టాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడుతున్నది. కానీ తెలంగాణ సర్కారు కొవిడ్ బాధితులు ఆక్సిజన్కు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్లోని రిమ్స్కు 6 వేల లీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకర్ను పంపింది. శుక్రవారం రిమ్స్కు చేరుకోగా, సిబ్బంది డంప్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరగా, ఇక్కడికి వచ్చే సరికి డీఎంఈ, డ్రగ్ ఇన్స్పెక్టర్, రిమ్స్ డైరెక్టర్, ఆక్సిజన్ విభాగ అధికారులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డెరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులకు చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్, ఇంజెక్షన్లు, బెడ్లు ఉన్నాయన్నారు. పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసొలేషన్లో జాగ్రత్తగా మందులు, ఆహారం తీసుకోవాలని సూచించారు. ఇబ్బంది ఉంటే రిమ్స్లో చేరాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని గుర్తుచేశారు. రిమ్స్ దవాఖానలో 510 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 110 ఐసొలేషన్, 295 ఆక్సిజన్, 105 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రిమ్స్లో 85 మంది ఆక్సిజన్, ఐసీయూలో, 112 మంది ఆక్సిజన్ బెడ్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అవసరమున్న కొవిడ్ బాధితులే ఆక్సిజన్ ఉపయోగించుకోవాలని సూచించారు. రిమ్స్లో ఇంకా 313 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఇవి కూడా చదవండి
శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు.. నెగిటివ్ రిపోర్టు ఉంటేనే దర్శనానికి అనుమతి
IPL 2021: రోహిత్ శర్మ ఒంటరి పోరాటం..ముంబై స్కోర్ 131