అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన రోజురోజుకి పెరిగిపోతుంది. ఏపీలో కరోనా కేసులు ఒక్కరోజే 10 వేల మార్క్ను దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,759 మంది కరోనా భారిన పడగా, కొవిడ్-19తో 31 మంది మృతిచెందారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,97,462కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 66,944. రాష్ట్రవ్యాప్తంగా 7,541 మంది మృత్యువాతపడ్డారు.
గత 24 గంటల్లో జిల్లాల వారీగా మృతుల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా 1,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కర్నూలు-1,367, శ్రీకాకుళం-1,336, గుంటూరు-1,186, తూర్పుగోదావరి-992, విశాఖపట్నం-844, నెల్లూరు-816, కృష్ణా-679, విజయనగరం-562 కేసులు నమోదయ్యాయి.