నారాయణపేట : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాగనూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీటీసీ వెంకటయ్య, సింగిల్విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.