హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. వైద్య రంగానికి కాకర్ల అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిమ్స్ డైరెక్టర్గా కాకర్ల చేసిన కృషి ఎనలేనిది అని తెలిపారు. ఈ సందర్భంగా కాకర్ల కుటుంబ సభ్యులకు మంత్రి ఈటల రాజేందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాకర్ల సుబ్బారావు.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.