రైతులకు ఇబ్బందులుకలుగకుండా చూడాలి
హుజూరాబాద్ తహసీల్దార్ బావుసింగ్
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్15: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తహసీల్దార్ బావుసింగ్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. తహసీల్ కార్యాలయంలో గు రువారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. కేంద్రాల్లో రైతులకు సకల వసతులు కల్పించాలని, నిబంధనల ప్రకారం ధాన్యా న్ని కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో టౌన్ సీఐ సదన్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్, ఏవో సునీల్కుమార్, సింగిల్ విండో చైర్మన్లు కౌరు సుగుణకార్రెడ్డి, అనుమండ్ల శ్యాం సుందర్రెడ్డి, ఎడవెళ్లి కొండాల్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఐకేపీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా ధాన్యాన్ని సేకరించాలి..
జమ్మికుంట, ఏప్రిల్ 15: ప్రభుత్వ ఆదేశాల మేర కు ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టాలని త హసీల్దార్ డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మండల పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో సేకరించాలన్నారు. ఇబ్బందుల్లేకుండా చూడాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనలపై చర్చించారు. సమావేశం లో ఎంపీపీ మమత, ఎంపీడీవో జయశ్రీ, ఏవో గోవర్ధన్రెడ్డి, పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
నీట్ పీజీ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా
రాజస్థాన్కు షాక్..17 పరుగులకే 3 వికెట్లు