రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో విషాదం నెలకొంది. పెద్దమ్మ ఆలయం వద్ద ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని నాగర్కర్నూల్ జిల్లా తలకొండపల్లికి చెందిన రాజ్కుమార్(27)గా పోలీసులు గుర్తించారు. గతకొద్ది కాలం నుంచి రాజ్కుమార్ హైదరాబాద్లో టీ మాస్టర్గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంకుసాపూర్కు బైక్పై వచ్చిన రాజ్కుమార్ పెద్దమ్మ ఆలయం వద్ద ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.