ఖమ్మం : భారత రత్న డా.బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. అలాగే ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ అభిమాన సంఘాల విజ్ఞప్తి మేరకు పాత జడ్పీ సెంటర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా14 అడుగుల విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ విశేష కృషి చేశారన్నారు. అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు.
నేటి నుంచి జడ్పీ సెంటర్ను అంబేద్కర్ సెంటర్గా నామకరణం చేశారు. ఇక నుంచి ఇలానే పిలవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ ఎస్సి, ఎస్టీ, బీసీ, స్వేరోస్, అంబేద్కర్ అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ