న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పుణ్యమా? అని వ్యక్తిగత మొబిలిటీ పెరిగిందన్న వార్తలు ఊరట కలిగిస్తున్నా.. 2020తో పోలిస్తే మార్చి సేల్స్లో డీ-గ్రోత్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో మోటారు బైక్లు, స్కూటీల కొనుగోళ్లు 13.69 శాతం పడిపోయాయి.
గత నెలలో ప్యాసింజర్ కార్లు, కమర్షికల్ వెహికల్స్, టూ వీలర్స్ విక్రయాలు 18.6 కోట్లు మాత్రమే జరిగాయి. గతేడాది మార్చిలో 21.5 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం 13.69 శాతం యూనిట్ల విక్రయాలు పడిపోయాయి.
ఇక టూ వీలర్స్ సేల్స్ 13.19 శాతం పడిపోయాయి. గతేడాది 17.4 కోట్ల యూనిట్ల వాహనాలు అమ్ముడైతే, గత నెలలో కేవలం 15.1 కోట్ల యూనిట్లకే పరిమితం అయ్యాయి. ఈ సంగతి ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సోమవారం వెల్లడించింది.
ఇక కమర్షియల్ వాహనాల విక్రయాలు 2021 మార్చిలో 21 శాతం పడిపోయాయి. గతేడాది మార్చిలో 7.17 లక్షల వాహనాలు అమ్ముడు కాగా, ఈ ఏడాది అది 5.68 లక్షల యూనిట్లకే పరిమితమైందని సియామ్ తెలిపింది.
ఇక ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మాత్రమే కాస్త రిలీఫ్ ఇచ్చాయి. గత మార్చిలో 2.24 శాతం మాత్రమే తగ్గింది. 2020 మార్చిలో 27.7 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ విక్రయమైతే ఈ ఏడాది 27.1 లక్షల యూనిట్లను కస్టమర్లు కొనుగోలు చేశారు.
త్రీ వీలర్స్ సేల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతేడాది మార్చిలో 6.37 లక్షల త్రీ వీలర్స్ అమ్ముడైతే.. గత నెలలో అది కేవలం 2.16 లక్షలే. అంటే 66.06 శాతం విక్రయాలు పడిపోయాయి.
కొవిడ్ రెండో వేవ్ నేపథ్యంలో తమ ప్రజల, భాగస్వాముల, కస్టమర్ల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నామని సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవా తెలిపారు. కొవిడ్ సవాళ్లను అధిగమించేందుకు కష్టపడి పని చేస్తూ గరిష్ఠంగా ఉత్పత్తి చేయడంతో సేల్స్ పెంచడానికి క్రుషి చేస్తామన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావానికి తోడు సంస్థాగతంగా ఆటోమొబైల్ పరిశ్రమలో నెలకొన్న మందగమనం ఫలితంగా వెహికల్స్ విక్రయాలు కొన్నేండ్ల స్థాయికి పడిపోయాయని కెనిచి అయుకవా ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రయత్నాలతో రికవరీ సాధించడానికి సమయం పడుతుందన్నారు కెనిచి అయుకవా. దీనికి తోడు సెమీ కండక్టర్ల కొరత మరింత సమస్యగా పరిణమించిందన్నారు.
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..